Thursday, May 2, 2024

ధ్వజస్థంభం ప్రతిష్ట..

కుత్భూల్లాపూర్ : సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దేవాలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ధ్వజస్థంభ ప్రతిష్ట కోరకు తయారీ జరుగుతున్నప్రదేశం నుండి హెచ్‌ఎఎల్‌ కాలనీ కమాన్‌ వద్దకు చేరుకుంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కమాన్‌ దగ్గర నుండి గురువారం సాయంత్రం 4 గంటల నుండి సత్యనారాయణస్వామి భక్తులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, కాలనీ లలిత భజన భక్తమండలి, శ్రీ సత్యనారాయణస్వామి ఆలయ కమిటీ సభ్యులు అన్ని కాలనీల పెద్దల సమక్షంలో ఊరేగింపుగా సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి సత్యనారాయణస్వామి ఆశీస్సులు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement