Tuesday, May 21, 2024

నాయకులే మారుతున్నారు… బాధలు మాత్రం అవే !!

రాజకీయ పార్టీలు మారుతున్నాయి. అధికారులు మారుతున్నారు. కానీ కొందరి పరిస్థితి మాత్రం మారట్లేదు. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఘటన. రోడ్డు సరిగా లేకపోవటంతో 108 అంబులెన్స్ రాలేదు. దీనితో 2 కి.మీ దూరం డోలితో ప్రసవ వేదనతో బాధ పడుతున్న గర్భిణిని మోసుకుంటు అంబులెన్స్ వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడో కాదు విశాఖపట్నం జిల్లాలోనే.

వివరాల్లోకి వెళ్తే… డుంబ్రిగుడ మండలం కొల్లపుట్ పంచాయితీ బొడ్లమామిడి గ్రామ గోళ్ళూరి పార్వతిని ప్రసవ వేదనతో బాధపడుతుంది. దీనితో భర్త దివకర్ రావు హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. కానీ రోడ్డు బాగలేకపోవటం తో అంబులెన్స్ రాలేదు. అప్పుడు 2 కి.మీ దూరం కుటుంబ సభ్యుల సహకారంతో డోలితో మోసుకుంటు అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement