Thursday, May 9, 2024

Bjp Elcetion Campaion : ఇవాళ రాష్ట్రానికి బీజేపీ ముఖ్య నేతల క్యూ

ఇవాళ‌ రాష్ట్రానికి బీజేపీ ముఖ్య నేతలు రానున్నారు. జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, పియూష్ గోయల్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలొ భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్య‌టించనున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉదయం నిజామాబాద్ అసెంబ్లీ, మధ్యాహ్నం సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో న‌డ్డా ప్రచారం చేపట్టనున్నారు.

ఖైరతాబాద్ సెగ్మెంట్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాదయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం సిరిసిల్లలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో స్మృతి ఇరానీ ప్రసంగించనున్నారు. అనంతరం మహిళా సమ్మేళనంలో స్మృతి ఇరానీ పాల్గొంటారు. స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్టేషన్ ఘనపూర్, సాయంత్రం వర్ధన్నపేటలో అర్జున్ ముండా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. సాయంత్రం హైదరాబాద్ రామకోటిలో బిజెపి కార్యకర్తల ఇంటల్ లెక్చువల్ సమావేశంలో పియూష్ గోయల్ పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement