Tuesday, May 7, 2024

Revanth Reddy: ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ‌ ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం దుబ్బాక, మధ్యాహ్నాం హుజూరాబాద్, మానకొండూర్ బహిరంగ సభల్లో, మహేశ్వరం, సాయంత్రం ఎల్బీ నగర్, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.

ముందుగా దుబ్బాకలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా మానకొండుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు.ఇవాళ‌ కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా దుబ్బాకలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా మానకొండుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు. రేణికుంట టోల్ గేట్ ప్రక్కన భారీ బహిరంగ సభకు పూర్తీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement