Saturday, May 4, 2024

ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వా…మాజీ ఎమ్మెల్యే కూన ఫైర్

ప్రజా సమస్యలు పట్టవా అంటూ అధికారులపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చింతల్ డివిజన్ వివేకానంద నగర్ లో గత కొంతకాలంగా డ్రైనేజీ పైప్ లైన్ల కోసం ఇష్టానుసారంగా రోడ్లను తవ్వి గాలికొదిలేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు స్థానికులు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కూన దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి విశ్రమించని కృషి చేస్తానని హామీనిచ్చారు. బస్తీలలో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని లేకపోతే ప్రజలు తరపున మున్సిపల్, వాటర్ వర్క్స్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని కూన శ్రీశైలం గౌడ్ అధికారులను హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement