Monday, April 29, 2024

ఇంటర్ మీడియట్ లో ప్రవేశానికి రేపే ఆఖ‌రి రోజు..

వికారాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికారాబాద్ లో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ పొందడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తారీకు చివ‌రి రోజ‌ని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ పొందే విద్యార్థులు వెంటనే ఎస్ఎస్సి మెమో,ఒరిజినల్ టీసీ, ఆధార్ సర్టిఫికెట్లతో కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ ఈ సి గ్రూపులు, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని తెలిపారు.అదే విధంగా అడ్మిషన్ పొంది టీసీ, ఇతర సర్టిఫికెట్స్ కళాశాలలో ఇవ్వని విద్యార్థులు వెంటనే తప్పకుండా వాటిని కళాశాల కార్యాలయంలో అందజేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement