Tuesday, May 21, 2024

ఘ‌నంగా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌యంతి వేడుక‌లు

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు, భార‌త దేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ క‌లాం జ‌యంతి వేడుక‌లు విజయనగరంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ రోజు ఆయ‌న జ‌యంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక ఉర్దూ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాద్ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని, ఆయ‌న జీవితాన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూచించారు. పిల్ల‌లే రేప‌టి త‌రం భ‌విష్య‌త్త‌ని.. వారిని బాగా చదివించాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో కాసేపు ఉర్దూ పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌లెక్ట‌ర్ ముచ్చ‌టించారు. అంద‌రూ బాగా చ‌దువుకోవాల‌ని, గొప్ప‌వారు కావాల‌ని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లో విజేత‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం స్థానిక పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని క‌లెక్ట‌ర్‌, జేసీలు ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement