Thursday, May 2, 2024

Press Club లో అంబరాన్ని అంటిన సపోస్ క్రిస్మస్ వేడుకలు….

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)22;కుల మతాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ లో క్రిస్మస్ జరుపుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. తోటి వ్యక్తులను ప్రేమించాలని,మానవుల మధ్య ఉన్న అగదాన్ని తగ్గించడం కోసం క్రీస్తు జన్మించాడని పాస్టర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైరి శేకర్, కోశాధికారి సందీప్, కార్యవర్గం అధ్వర్యంలో నిర్వహించిన సపోస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు జన్మ దినం గురించి పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సి ఎస్ ఐ చర్చ్ ఫాదర్ రెవరెండ్ ప్రకాష్ మాట్లా డుతూ.. దేవుడు అందరినీ బాగా చూడాలని దేవుని కృప అందరిపై ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement