Thursday, May 2, 2024

Andhra Pradesh – ఎస్ఐ పోస్టుల ఫలితాలు వెల్ల‌డి… టాప‌ర్ల‌గా భాస్క‌ర‌రావు, కృష్ణ‌వేణి..

విజ‌య‌వాడ – రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఎస్ఐ పోస్టులకు మొత్తం 315 మంది ఎంపికయ్యారు. వీరిలో 102 మంది మహిళలు ఉండటం విశేషం. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో ఎస్ఐ ల ఎంపిక జరిగింది. విశాఖ జోన్ లో 50, ఏలూరు జోన్ లో 105, గుంటూరు జోన్ లో 55, కర్నూలు జోన్ లో 105 మంది ఎంపిక అయ్యారు. ఎస్ఐ పరీక్షల్లో టాపర్ లుగా గోనబోయిన భాస్కరరావు, లోగిస కృష్ణవేణి నిలిచారు. ఎంపికైన వారికి త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. వాటి ప‌రిశీల‌న అనంత‌రం అర్హ‌త సాధించిన అభ్య‌ర్ధుల‌కు ఉద్యోగ నియ‌మ‌క ప‌త్రాలు అంద‌జేస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement