Friday, May 17, 2024

Safe – మెట్లు ఎక్కుతూ జారీ పడ్డ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు.

అయితే తన రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్‌కు సహాయం చేసి పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement