Friday, April 26, 2024

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రతి రోజు భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్న పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ కు షాక్.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి బ్రేక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement