Saturday, April 27, 2024

అక్రమ వెంచర్లపై పోలీసుల అటాక్.. చెన్నూరులో కూల్చివేత‌లు షురూ!

చెన్నూర్ (ప్రభన్యూస్) : అక్ర‌మ వెంచ‌ర్ల‌పై పోలీసులు దృష్టిపెట్టారు. దినదినావృద్ధి చెందుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారి ఆనుకొని భూ వ్యాపారులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వెంచర్లను మంగళవారం వేకువ జామున చెన్నూరు పోలీసులు కూల్చి వేశారు. 3 మండలాలకు కేంద్ర బిందువైన చెన్నూరు పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుండడంతో మంచిర్యాల, చెన్నూరు తదితర పట్టణాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములతో పాటు నిరుపేదలకు చెందిన భూములను కబ్జా చేశారు.

కొంత‌మంది అక్ర‌మాల‌కు, లంచానికి మ‌రిగిన‌ రెవెన్యూ అధికారుల అండతో రికార్డులు సృష్టిస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. చెన్నూరు బావురావుపేట, కిష్టంపేట గ్రామల హైవే ప్రాంతాల్లో ఈ అక్ర‌మాలు జోరుగా సాగుతున్న‌యి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అక్రమాలను తొల‌గించే కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement