Sunday, April 28, 2024

TS : ఇవాళ జగిత్యాల జిల్లాలో మోదీ పర్యటన…భారీ బహిరంగ సభ…

జగిత్యాల జిల్లాల్లో ప్రధానమంత్రి మోదీ పర్యటించనున్నారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో అయన పాల్గొననున్నారు. ఉదయం 11.30 నుంచి 12.20 వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగిస్తారు.

- Advertisement -

నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ సభను ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాసే శ్రీనివాస్ అభ్యర్థులను మోదీ ఆశీర్వాదిస్తారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనున్నది. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మూడు నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement