Monday, April 29, 2024

TS : ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్‌లో ఇవాళ నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

ప్రధాన నరేంద్ర మోదీ రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 గంటల నుంచి 10.20 గంటలకు వరకు వివిస్టాట్యూ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంఎంటిఎస్ రాజ్‌భవన్, పంజాగుట్ట, గ్రీన్స్‌ల్యాండ్, హెచ్‌పిఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను ఆపివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement