Wednesday, May 8, 2024

Flash: రెండు లారీ ఢీ.. ఒకరు మృతి

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి లారీల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement