Saturday, April 27, 2024

TS : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 10మందికి గాయాలు

నల్గొండ : రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 10మందికి గాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందగా.. పది మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement