Thursday, May 2, 2024

Kamareddy: లిఫ్టులో పడి యువకుడు మృతి

లిఫ్టులో పడి యువకుడు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో చోటుచేసుకుంది. సందీప్ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని నూతనంగా నిర్మిస్తున్న ఇంటివద్ద అనుమానాస్పద స్థితిలో లిఫ్టులో పడి లింగంపల్లి దత్తాద్రి అనే వ్యక్తి మృతిచెందాడు. నూతనంగా నిర్మాణం చేపట్టిన భవనంలోని లిఫ్ట్ గదిలో దత్తాద్రి మృతదేహం లభించింది. అయితే ఇది హత్యనా, ఆత్మహత్యనా, ఏదయినా ఘర్షణ జరిగిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement