Saturday, April 27, 2024

NZB | మైనారిటీల అభివృద్ధికి కృషి… మంత్రి సీతక్క

ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. నిజామాబాద్ పట్టణంలో జరిగిన ఇఫ్తార్‌ కార్యక్ర మానికి హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం ప్రధాని మోదీ తరం కాదని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ అన్నారు. ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్లకాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement