Monday, April 29, 2024

Accident: మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదం.. బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు

సిరికొండ, ఆగస్టు 22 (ప్రభ న్యూస్): మేడ్చల్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన తోట రాజన్న (రావుట్ల సర్పంచ్ భర్త), ప్యాట్ల అశోక్, భూమయ్య, నడుకుడ రెడ్డి (రాజేందర్), హరిబాబు అనే బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల ప్రకారం… కోళ్ల దాన తీసుకువెళుతున్న డీసీఎం వ్యాన్ ప్రధాన రోడ్డు వైపు రావడానికి మలుపు వద్ద టర్నింగ్ చేస్తున్న సమయంలో వాహనాలను గమనించ కుండా ప్రధాన రోడ్డు వైపు డీసీఎం వ్యాన్ రావడం వల్ల రావుట్ల గ్రామస్థులతో ప్రయాణిస్తున్న కారు డీసీఎంను ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు చెప్పారు.


ప్రమాదంలో గాయపడ్డ వారికి కాళ్ళు చేతులు విరిగినట్లు తెలిసింది. వీరితో పాటు మరో రెండు కార్లల్లో రావుట్ల గ్రామానికి చెందిన వారు ప్రయాణిస్తున్నారు. నిజామాబాదు రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రకటించినందున ఎమ్మెల్యే గోవర్ధన్ ను కలసి శుభాకాంక్షలు చెప్పడానికి వీరంతా హైదరాబాద్ వెళుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే గోవర్ధన్ సూచన మేరకు క్షతగాత్రులను హుటాహుటిన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement