Sunday, April 28, 2024

TS | కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: నర్సారెడ్డి భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్​ (ప్రభన్యూస్​): టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి ఇవ్వాల అప్లికేషన్ ను, బయోడేటాను గాంధీభవన్ లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి వెళ్ళి అందజేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం, టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement