Thursday, May 2, 2024

NLG: మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 22 (ప్రభా న్యూస్): మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న కేసీఆర్ ప్రకటించిన సందర్బంగా తనను అభ్యర్థిగా ప్రకటించడానికి సహకరించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని తన నివాసంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. మూడవసారి మునుగోడులో గులాబీ జెండా ఎగడం ఖాయమని అన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్…

ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా రమావత్ రవీంద్ర కుమార్ ను ప్రకటించిన సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement