Monday, April 29, 2024

NZB: ఐడిసిఎంఎస్ ఇన్చార్జి అధ్యక్షులుగా ఇంద్ర సేనారెడ్డి

నిజామాబాద్, ఏప్రిల్ 24(ప్రభ న్యూస్): ఐడిసిఎంఎస్ ఇన్చార్జి అధ్యక్షులుగా ఎదుళ్ళ ఇంద్ర సేనారెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం నిజామాబాద్ లో నిర్వహించిన ఐడిసిఎంఎస్ కార్యవర్గ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు ఎదుళ్ళ ఇంద్ర సేనారెడ్డి ఐడిసిఎంఎస్ నూతన ఇంచార్జి ప్రెసిడెంట్ గా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

అనంతరం సంఘ డైరెక్టర్లు, పలు సహకార సంఘాల అధ్యక్షులు, ఐడిసిఎంఎస్ సిబ్బంది నూతన అధ్యక్షులను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడి సిఎంఎస్ డైరెక్టర్లు ఈ. శ్రీనివాస్ గౌడ్, నల్లవెల్లి కపిల్ రెడ్డి, ఎన్.రాజేశ్వర్, యం.రాజా గౌడ్, సహకార సంఘాల అధ్యక్షులు, ఐడిసిఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.నగేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement