Tuesday, April 30, 2024

దోమకొండ మాజీ జ‌డ్పీటీసీ నరసింహులు దారుణ హత్య

కామారెడ్డి : ఉమ్మడి దోమకొండ మండలం మాజీ జ‌డ్పీటీసీ మన్నె నరసింహులు (50) దారుణ హత్యకు గురయ్యారు. కామారెడ్డిలో ఉండే మాజీ జ‌డ్పీటీసీ ఆదివారం గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి మామిడి తోటలోకి వెళ్లారు. కొత్తపల్లికి అప్పుడప్పుడు మాజీ జ‌డ్పీటీసీ వెళ్తుంటారు. మామిడి తోటలో మిత్రులతో కలిసి ఉండగా 22 సంవత్సరాల యువకుడు సందీప్ రెడ్డి మన్నె నరసింహులు పై గొడ్డలితో దాడి చేసి దారుణ హత్య చేశారు. మృతుడు నరసింహులు కామారెడ్డిలో అతిథి బార్ అండ్ రెస్టారెంట్ యజమాని.

మృతుడు గతంలో మహారాష్ట్రలో వైన్స్ వ్యాపారం చేస్తుండేవారు. మృతుడు నరసింహులది స్వగ్రామం బిబిపేట మండలం ఇస్సానగర్. గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి చెందిన మామిడి తోటలో తరచుగా వెళుతుండే వారని తెలిసింది. మామిడి తోటలో జూదం, దావతులు జరుగుతుంటాయని ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం యువకుడు సందీప్ రెడ్డి ఎంపీటీసీ భర్త భీమయ్యను నడిరోడ్డులో హత్య చేసి జైలుకెళ్లారు. మామిడి తోటలో ఉన్న నరసింహులును నిందితుడు గొడ్డలితో తలపై చేతిపై పలుచోట దాడి చేయడంతో మృతి చెందాడు. గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement