Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు మృతి

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి కారు ఇంటికి ఢీకొన్న ప్రమాదంలో కుప్పంకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement