Monday, May 13, 2024

టూవీల‌ర్‌ని ఢీకొన్న ట్ర‌క్టు.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నిజాంపేట (ప్రభన్యూస్) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చ‌నిపోయిన ఘటన మెద‌క్ జిల్లాలో జ‌రిగింది. నిజాంపేట మండలకేంద్రంలో మంగళవారం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్కల్ గ్రామానికి చెందిన గుమ్ముల రాజు ( 35 ) తన వ్యవసాయ పొలానికి యూరియా సంచులు తీసుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.

నిజాంపేట నుండి భూంపల్లి కి టూ వీల‌ర్ పై వెళ్తుండగా శ్రీచక్ర పౌల్ట్రీ ఫామ్ దగ్గర మినీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అత‌ను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య రేవతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement