Thursday, May 16, 2024

నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్

వికారాబాద్ ఆగస్టు 9 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని వికారాబాద్ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ ( రాజు గౌడ్ ) జిల్లా గ్రంథాల సంస్థ కార్యదర్శి సురేష్ సిబ్బంది కృష్ణగౌడ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాలకు అధిక ప్రాచీతనిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు, కోటి 35 లక్షల రూపాయలతో తాండూరులో నూతన భవనాన్ని నిర్మించినట్టు ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం పోటీ పరీక్షలు నేపథ్యంలో అవసరమైన వారికి తప్పనిసరిగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఎవరికి అవసరం ఉన్నా జిల్లా గ్రంథాల సంస్థ లో కోరితే తప్పనిసరిగా సమకూర్చిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలోని 18 మండలాల్లో పుస్తక నిక్షిప్త కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికే మర్పల్లిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తాండూర్ లో నిర్మించిన కోటి 30 లక్షల రూపాయలతో చేసే శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో మంత్రి సబితా రెడ్డి తో శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నట్టు అయిన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement