Tuesday, April 30, 2024

సి.ఎం కాళ్లు మొక్కైనా రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా : ఎమ్మెల్యే బాపూరావు

బోథ్ ఆగస్టు 9 ప్రభా న్యూస్ – ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కయినా సరే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రానికి రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హామీ ఇచ్చారు. బోత్ ప్రాంత ప్రజలందరూ కలిసి రెవెన్యూ డివిజన్ సాధన సమితి పేరిట గత 24 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు బోథ్ పట్టణంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, గతంలో తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి తీసుకురావాలని ఆలాగే ఫైర్ స్టేషన్,డిగ్రీ కాలేజ్,కోర్టు భవనం పూర్తి చేయాలని తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందని దానిని కచ్చితంగా తీసుకువచ్చే బాధ్యత నాదని, అలాగే తరలిపోయిన కార్యాలయాలను కూడా వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను చేపడతానని హామీ ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతానని మీ అందరి సహకారంతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధిస్తానని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement