Tuesday, May 7, 2024

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ సెప్టెంబర్ 17: సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందన సమర్పణ చేశారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సందేశం ఇస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తద్వారా మేడ్చల్ జిల్లా ను అన్ని రంగాలలో ముందుకు తీసుకు పోవటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ కుమార్, అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి, మేడ్చల్ డి.సి.పి అంబరీష్, డి.ఆర్.వో హరిప్రియ, ప్రజా ప్రతినిధులు నందారెడ్డి, మధుకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement