Sunday, May 19, 2024

Vikarabad – పేదరిక నిర్మూలన ప్రభుత్వ లక్ష్యం – మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ సెప్టెంబర్ 17 ( ప్రభ న్యూస్):ప్రెస్ నోట్:వికారాబాద్ , సెప్టెంబర్ 17: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భంలో శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమై 76 సంవత్సరాలు పూర్తి అయినందున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడంలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపల పంపిణీ, ఆసరా పింఛన్లు , కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, కంటి వెలుగు, దళిత బంధు, విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజన లాంటి మహోత్తరమైన కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా రాష్ట్రంలో అమలు చేయడం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు .

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు పథకం ద్వారా కుటుంబానికి 10 లక్షలు అందించడంతోపాటు లబ్ధిదారులకు అనుకొని సంఘటన జరిగినప్పుడు అండగా నిలిచేందుకు రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 30 వేల 278 మంది లబ్ధిదారులకు 351 కోట్ల 22 లక్షలు అదేవిధంగా షాదీ ముబారక్ ద్వారా 6,676 మంది లబ్ధిదారులకు 77 కోట్ల 45 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వికారాబాద్ బాలికల జెడ్పి , సంగం లక్ష్మీబాయి బాలికల, బండి వెనుకచెర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అతిధులు సాంస్కృతిక కార్యక్రమాల పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపకలను అందజేశారు.అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా జిల్లా సమాఖ్య సభ్యులకు 247 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 50 లక్షలు రూపాయల చెక్కులను అదేవిధంగాశ్రీనిధి ద్వారా జిల్లా సమాఖ్య సభ్యులకు 62 స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల 30 లక్షలు రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పి కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ , జిల్లా అదనం కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement