Sunday, April 28, 2024

TS : చెక్‌పోస్టు వ‌ద్ద వాహ‌నాల త‌నిఖీలు…ల‌క్షా 70వేల న‌గ‌దు ప‌ట్టివేత‌

మద్దిరాల, మార్చి 21 (ప్రభ న్యూస్) : లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా సరిహ‌ద్దు ప్రాంత‌మైన కుంట‌ప‌ల్లి శివారులో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం చెక్‌పోస్టు వ‌ద్ద వాహ‌నాల‌ను త‌నిఖీలో ల‌క్షా 70వేల రూపాయ‌లు దొరికాయి. వాటిని సీజ్ చేసిన‌ట్లు ఎస్ఐ మ‌ధు నాయ‌యుడు తెలిపారు.

- Advertisement -

భువనగిరి జిల్లాకు చెందిన సతీష్ వ్యాపార నిమిత్తం మహబూబాబాద్ జిల్లా నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోనిపస్తాల గ్రామానికి వెళ్తున్న టిఎస్ 31 టి 6332 నెంబర్ గల వాహనాన్ని తనిఖీ చేయడం జ‌రిగింద‌న్నారు. అతని వద్ద ఒక లక్ష 70 వేల రూపాయలు దొరికినట్లు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా వ్యాపారస్తులు నగదు తీసుకెళ్లేటప్పుడు వాటి యొక్క ఆధారాలు తీసుకొని రావాలని అన్నారు. ఆయన వెంట పోలీసులు వెంకన్న, అశోక్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement