Thursday, May 16, 2024

6.35 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

మోతె, (ప్రభన్యూస్) : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. మోతె ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై మామిళ్లగూడెం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరించారు.

వారి వద్ద నుండి 6 కిలోల 350 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బలి సర్ బంజారా మరొకరు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ యాదవ్ లుగా తెలిసినది. నిందితులిద్దరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement