Tuesday, May 14, 2024

ఓట్ల కోసం వరి కోశారు..

నల్గొండ : వరికోసే కూలీలను కలిసి వారి ఓట్లను అభ్యర్థించారు పలువురు నాయకులు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా త్రిపురారం మండలంలోని లచ్చతండాలో వరికోసే కూలీలను కలిసి వారి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాసేపు కూలీలకు విశ్రాంతినిచ్చిన నేతలు పొలంలో నడుం వంచి వరి కోత కోశారు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement