Monday, July 22, 2024

TS: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52మంది…

నామినేషన్స్ ఉపసంహరించుకున్న 11మంది
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు
ఈనెల 27న పోలింగ్
605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 4.63ల‌క్ష‌ల మంది ప‌ట్ట‌భ‌ద్రులు
వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52మంది అభ్యర్థులు మిగిలారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 52మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది..

ఇక ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్‌ 5వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement