Tuesday, April 30, 2024

మునుగోడులో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం : మంత్రి తలసాని

సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పేర్కొన్నారు. మునుగోడులోని నాంపల్లిలో పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో నే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. మునుగోడు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని తెలిపారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల పని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement