Friday, May 17, 2024

MDK : తెలంగాణ ఇచ్చినం… ఎంపీ అభ్య‌ర్థి నీలం మ‌ధు

మాజీ సీఎం కేసిఆర్, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చానని అంటున్నాడు కదా? అసలు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జయరెడ్డిలతో రోడ్ షో నిర్వాహించారు. అనంత‌రం మల్లేపల్లి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో మాయమాటలు చెప్పే పార్టీల మాటలు నమ్మవద్దని సూచించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని నీలం మధు విజ్ఞప్తి చేశారు. డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని, దేశంలో కూడా అధికారంలోకి రావాలంటే ఎంపీ అభ్యర్థి నీలం మదును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement