Tuesday, May 21, 2024

TS: బండ‌కేసి కొట్టినా కేసీఆర్ కు బుద్దిరాలా… ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

అయ‌న చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే..
ఆబ‌ద్దాల పునాదుల‌పైనే బీఆర్ఎస్ పార్టీ ..
అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల గుణ‌పాఠం
ఏ వ‌ర్శిటీలోనూ విద్యుత్ కోత‌, తాగునీరు స‌మ‌స్య‌ల్లేవ్
కూసుమంచి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి
పాలేరు – తెలంగాణ ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను బండ‌కేసి కొట్టినా కేసీఆర్ కు బుద్దిరాలేదంటూ ఫైర్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ.. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ నిర్మించార‌న్నారు.. ఆయ‌న నోరు తెరిస్తే చెప్పేది అబద్దమే అన్నారు.

అబద్దాల పునాదులపై బతుకుతున్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయలేరని అబద్దాలు మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం చేశామన్నారు. మార్చి ఒకటో తేదీనుంచి 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుపేద, అర్హత కలిగిన అబ్దిదారులకు రూ.500కే గ్యాస్ ఇస్తున్నామన్నారు. అంతేకాక ప్రతి నియోజకవర్గంలో నిరుపేదల కోసం 3,500 రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామ‌ని.. వారికి తప్పకుండా అందిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో పేదలు, దళిత, గిరిజనులు అధికంగా ఉంటార‌ని, త‌మ‌కు అధికంగా ఇండ్లు మంజూరు చేయాలని కోరార‌న్నారు. తప్పకుండా అధికంగానే ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.

కేసీఆర్ తన‌ పదేళ్లలో ఏనాడైనా పంట నష్టాన్ని అంచనా వేసి.. పరిహారాన్ని అందించారా ? అని ప్రశ్నించారు భ‌ట్టి. జరిగిన నష్టంకు సంబంధించిన లెక్కలను కూడా తెప్పించుకున్నామ‌ని, తప్పకుండా పరిహారాన్ని అందిస్తామ‌ని అంటూ బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామ‌ని, కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యుత్, తాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంద‌ని, విద్యార్థులంతా అక్కడే ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చన్నారు. విద్యుత్ కోతలపై పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారు. పవర్ కట్ అంటూ.. జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇండ్లలో కూర్చుని తప్పుడు ట్వీట్లు చేశారని మండిపడ్డారు.

- Advertisement -

కాగా, అబద్దాలతో, కట్టు కథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులపై క్రోని కేపిటలిస్టులకు ప్ర‌ధాని కట్టబెడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భ‌ట్టి..

దేశ సంపదను ప్రధాని మోదీ, రాష్ట్ర సందను కేసీఆర్ ఈ పదేళ్లలో దోచేశారంటూ ఆరోపించారు.. మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ-మోదీ ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ సందను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు వచ్చారన్నారు. మనమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement