Friday, May 17, 2024

TS : ప‌ది ఫ‌లితాల్లో రాష్ట్రంలో నిర్మ‌ల్ జిల్లా ప్ర‌థ‌మ‌స్థానం

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 30 ప్రభ న్యూస్ః తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలలో నిర్మల్ జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. 99.09 శాతం ఉత్తీర్ణతత్వం ప్రథ‌మస్థానాన్ని నిలబెట్టుకుంది. గత సంవత్సరం సైతం ప్రథమ స్థానంలో నిలవడం, వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో పది ఫలితాల్లో మొదటి స్థానంలో ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ జిల్లా విద్యా విభాగానికి చెందిన అధికారులను అభినందించారు.

గతం కంటే 9 అధిక శాతం ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్ జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రచమ స్థానం సంపాదించడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షణ వ్యక్తం చేయగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి కలెక్టర్ ఆశిష్ సంఘం కు మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించారు. పదవ తరగతి ఫలితాలలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. డిఇఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం వల్ల నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం సాధించిందని గత సంవత్సరం ఫలితాల కన్నా 0.9శాతం అధిక శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుందని, విద్యార్థులు ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయులకు అధికారులకు కృతజ్ఞతలు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement