Monday, May 20, 2024

TS : మే 3న సిరిసిల్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

సిరిసిల్ల, ఏప్రిల్ 30 (ప్రభ న్యూస్) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మే 3న పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్థానిక పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో మే 3న మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

ఈ మేరకు మంగళవారం బహిరంగ సభ స్థలి ప్రాంగణాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తున్నారు. ఇందు కోసం భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి పరిశీలన అనంతరం కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ ఎత్తున సిరిసిల్ల నియోజకవర్గం నుండి జనాన్ని, పార్టీ శ్రేణులను, శ్రేయోభిలాషులను తరలించి సభను విజయవంతం చేయడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత మందిని ప్రజల్ని తరలించాలో, పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించడానికి సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సభ ప్రాంగణం పరిశీలన లో కాంగ్రెస్ నాయకులు నాగల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, అకునూరి బాలరాజు, నేరెళ్ల శ్రీకాంత్, రెడ్డి నాయక్, కుడిక్యాకల రవి, వెంగళ లక్ష్మీ నరసయ్య, వెలుముల తిరుపతిరెడ్డి, బైరి ప్రభాకర్, గుండ్లపల్లి గౌతం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement