Tuesday, May 7, 2024

గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

న‌ల్ల‌గొండ జిల్లాలో అక్ర‌మంగా గంజాయి త‌ర‌లిస్తున్న అంత‌ర్ రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప‌ట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్‌పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద రీతిలో మూడు కార్లలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. నిందుతుల‌ను అదుపులోకి తీసుకుని.. కారులో తనిఖీలు చేయగా రెండు వందల కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుల వద్ద నంచి ఐదు సెల్‌ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement