ఒకపక్క కరోనాతో సతమతమవుతోంటే..మరోపక్క మంకీపాక్స్ కలవరం రేపుతోంది. కాగా కేరళ, ఢిల్లీలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి..దాంతో దేశంలో ఏడుకు చేరారు మంకీపాక్స్ బాధితులు. మంగళవారం కేరళలో మరొకరికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని వివరించారు. ఆయన కూడా యూఏఈ నుంచి తిరిగి వచ్చాడని తెలిపారు. యూఏఈ నుంచి గత నెల 27న కోళికోడ్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకున్నట్టు రాష్ట్ర మంత్రి వీణా జార్జి చెప్పారు. ప్రస్తుతం ఆయన మళప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీ చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో కేరళలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement