Friday, May 24, 2024

Join Congress Party – బిఆర్ఎస్ కు మ‌రో ఎమ్మెల్యే గుడ్ బై – రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరిన రేఖా నాయ‌క్

ఆర్మూర్ – ఖానాపూర్ ఎంఎల్‌ఎ రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేఖానాయక్ తన భర్త శ్యామ్ నాయక్‌తో కలిసి ఆర్మూర్ స‌భ‌లో రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో హ‌స్తం తీర్ధం పుచ్చుకున్నారు..రేఖ‌నాయ‌క్ ను, శ్యామ్ నాయక్‌ను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి రాహుల్ గాంధీ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు.

కాగా, ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖానాయక్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత ఉండడంతో నుంచి జాన్సన్ నాయక్‌కు సీటు కేటాయించినట్టు సమాచారం. తనకు సీటు కేటాయించకపోవడంతో బిఆర్‌ఎస్‌పై రేఖా నాయక్ నిప్పులు చెరిగారు. జాన్సన్ నాయక్ అసలు ఎస్‌టినే కాదని మండిపడ్డారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని సిఎం కెసిఆర్ కు సవాల్ విసిరారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండడంతో అతి త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. తాజాగా ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement