Monday, June 17, 2024

Bangalore : రేవ్ పార్టీలో ట్విస్ట్… ముగ్గురు పోలీసుల‌పై సస్పెండ్ వేటు

ఫామ్ హౌస్ కు కూత వేటు దూరంలోనే
హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌
పార్టీ జ‌రుగుతుంద‌ని తెలిసినా నిర్ల‌క్ష్యం
ఏఎస్ఐతో స‌హా ముగ్గురిపై వేటు
బెంగుళూరు రేవ్ పార్టీ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు దొరికిన నిందితులపై దృష్టి పెట్టారు పోలీసులు. తాజాగా జీఆర్ ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీకి సమీపంలోని పోలీస్ స్టేషన్‌పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ముగ్గురు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. రేవ్ పార్టీ విషయం తెలిసి కూడా విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు.

ఇక డ్రగ్స్ తీసుకున్న వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెస్టులు నిర్వహించారు. వచ్చిన రిపోర్టు ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మినవారు ఎవరు ? తీసుకున్నవారెవరు ? అనేది అందులో తేలనుంది. ఈ పార్టీకి మొత్తం 150 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ నేతలున్నారు. వీరిలో 105 మంది మాత్రమే పట్టుబడ్డారు. మిగతా వారు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషులు, 27మంది పాజిటివ్ వచ్చింది. ఈ రేవ్ పార్టీకి సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించారు. పార్టీకి 70మంది యువకులు, 30మంది యువతులు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు తేలింది. ఈ కేసులో ప‌ట్టుబ‌డిన అంద‌రి పేర్ల‌ను ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు.. అందులో టాలీవుడ్ న‌టి హేమ కూడా ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement