Monday, May 20, 2024

‘AP Hats Jagan’ బుక్ లెట్ ను విడుద‌ల చేసిన తెలుగుదేశం …..

అమ‌రావ‌తి – సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ 24 పేజీలతో ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం తీసుకువచ్చింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కే.ఎస్.జవహర్, గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితా చాంతాడంత ఉంటే, నెరవేర్చింది కేవలం చారడంతేనని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలన ఆసాంతం అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, దుర్మార్గాలు, దోపిడీల మయమని ప్రజలకు అర్థమైందని అన్నారు. తన ప్రభుత్వ అవినీతి, తాను చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తూ, వారిలో చైతన్యం తీసుకు వస్తున్నాడన్న అక్కసుతోనే చంద్రబాబును జగన్ రెడ్డి అన్యాయంగా జైలుకు పంపార‌ని ఆరోపించారు. జగన్ రెడ్డి నయవంచన పాలనకు అక్షరరూపమే 24 పేజీల ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం అని స్పష్టం చేశారు. ప్రజలంతా టీడీపీ విడుదల చేసిన ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని చదివాలని, జగన్ నిజస్వరూపాన్ని, వైసీపీ ప్రభుత్వ కపట నైజాన్ని తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement