Wednesday, May 8, 2024

న్యూ షాపూర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని న్యూ షాపూర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయమ‌న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, యువ నాయకుడు మంత్రి అరుణ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముకుంద్ రావు, నాయకులు మధు మోహన్, ఆమీర్ ఖాన్, బస్తీ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ ఆకుల రాజ్ కుమార్, బస్తీ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, ఉమర్, సంజీవ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement