Thursday, May 2, 2024

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: గొంగిడి సునీత

రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం యదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండల కేంద్రంలో మసీదు మునీర్ ప్రార్ధన మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఆడ పిల్లలను చదివించడానికి ప్రభుత్వం ఎన్నో గురుకుల పాఠశాలలను  ప్రవేశ పెట్టిందని చెప్పారు. ప్రార్థన మందిరం, దేవాలయం, అన్ని మత సామరస్యానికి ప్రతీకగా అందరితో స్నేహబంధాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement