బెంగాల్ లో నిన్న 4,512కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు 20నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుంది. కాగా మహారాష్ట్ర, కేరళ తర్వాత అత్యధికంగా బెంగాల్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రేపటి నుండి బెంగాల్ లో పాఠశాలలను మూసివేయనున్నారు. దీంతోపాటు అన్ని కార్యాలయాల్లో 50శాతం సిబ్బందితో మాత్రమే పని చేయనున్నాయి. స్కూల్స్ తో పాటు సినిమాథియేటర్స్, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, బ్యూటీ సెలూన్ లను మూసివేయనున్నారు. ఈ మేరకు పలు ఆంక్షలు విధించనున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..