Saturday, May 18, 2024

తెలంగాణలో సంక్షేమ పాలన

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఐఎంకు చెందిన కార్యకర్తలు TRSలో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేత కేసీఆర్‌ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారన్నారు. తెరాస హయాంలో అమలవుతున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నుంచి గులాబీ దండులో చేరుతున్నారన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement