Wednesday, May 8, 2024

విగ్ర‌హాల ప్ర‌తిష్ట.. రూ.25ల‌క్ష‌లు మంజూరు ఎమ్మెల్యే

జన్నారం, (ప్రభ న్యూస్): మండలంలోని బంగారుతండాలో జగదంబదేవి,సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ఖానాపూర్ ఎమ్మేల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ప్రతిష్టించారు. అనంత‌రం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆలయ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేశారు. మ‌రో రూ.5 లక్షల మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు ,సర్పంచ్ అస్లిబాయి, తిరుపతి, రవీందర్ కలిరాం,జలపతి, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, మండల కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్ ,టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాజారాంరెడ్డి ,జనార్ధన్ ,స్థానిక మండల నేతలు. ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement