Wednesday, May 8, 2024

మహిళ ఎస్సైతో దురుసు ప్రవర్తన.. ఇద్దరిపై ​కేసు నమోదు

వరంగల్ జిల్లా నెక్కొండ మండల ఎస్సై సీమ ఫర్హీన్ తో ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిపై కేసు నమోదే చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిన్న మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ తల్లి సెంటర్లో స్పైసీ బిర్యానీ సెంటర్ ముందు రాకపోకలను అంతరాయం కలిగించేలా వాహనాలు రోడ్డుపై నిలపారు. ఈ వాహనాలకు ఎస్సై జరిమాన విధిస్తున్న క్రమంలో హోటల్ యజమాని బానోత్ పవన్ కళ్యాణ్, బానోత్ ప్రేమ్ ఎస్సై విధులకు ఆటంకం కలిగించారు.

మొబైల్ లో జరిమానాలు విధిస్తున్న సమయంలో పరుష పదజాలంతో దూషించారు. అంతేకాకుండా ఎస్సై చేయి పట్టుకుని ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు. దీనికి చేయి ఎందుకు పట్టుకున్నావ్ అని ఎస్సై అడుగగా బూతులు తిడుతూ నానా దుర్భాషాలాడినట్లు ఎస్సై వివరించారు. అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బంది పై కూడా దాడికి పాల్పడి దూషించినట్లు ఎస్సై తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement