Saturday, April 27, 2024

పిల్లలు పుట్టరన్న కారణంతో దంపతుల ఆత్మహత్య.. పురుషాంగానికి ఫ్రాక్చరే కారణమంటూ లేఖ

పెళ్లయిన ఐదు నెలలకే చెన్నైలోని మధురవాయల్‌లో ఓ జంట ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్‌లో పురుషాంగం ఫ్రాక్చర్ కావడం వల్లే సంతానం కలగడం లేదనే ఆందోళనతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దంపతులు వెల్లడించారు. తూత్తుకుడి వాసి అయిన 22 ఏళ్ల యువకుడు చెన్నైలోని మధురవాయల్ పక్కనే ఉన్న అలపాక్కంలో ఉంటూ స్క్రాప్ మెటల్ దుకాణం నడుపుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో పెద్దల సమక్షంఓల 20 ఏళ్ల యువతితో వివాహమైంది. అయితే.. అతని బంధువులు ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు. దీనికి తోడు దుకాణం కూడా మూసి వేసి ఉండడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

ఇంటి తలుపులు తెరవకుండా ఉండడంతో ఇరుగుపొరుగు వారు డోర్​ కొట్టి ప్రయత్నించారు. అయినా తలుపులు తెరుచుకోలేదు. దీంతో మదురవాయల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం కిల్‌పాక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోదాల్లో వారు ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురుషాంగం ఫ్రాక్చర్ కారణంగా సంతానం కలగక పోవడంతో తమ  జీవితాలను ముగించుకుంటున్నామని, ఈ నిర్ణయం వెనుక ఎవరూ లేరు’ అని సంతకం చేసిన లేఖ లభించింది. ఈ విషయంపై దంపతులు డాక్టర్లను కూడా సంప్రదించలేదని, తమకు బిడ్డ పుట్టడం లేదనే మనస్తాపంతోనే ఉరేసుకున్నారని విచారణలో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement